Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జీఎస్టీ బిల్లుపై బీజేపీ వెనక్కి తగ్గిందా..?
posted on: Dec 18, 2015 10:41AM

ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో మోడీ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన జీఎస్టీ బిల్లును ఆమోదింపచేయాలని చూసింది. కానీ ఊహించని విధంగా నేషనల్ హెరాల్డ్ కేసు బయటకు రావడంతో ఇప్పుడు ఈ బిల్లు ఆమోదం పొందుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ బిల్లుకు సంబంధించి మోడీ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్ లకు తేనీటి విందు ఇచ్చి బిల్లును గురించి కూడా మాట్లాడారు. సోనియా, రాహుల్ కూడా తమ డిమాండ్ లు ఒప్పుకుంటే బిల్లును ఆమోదింపజేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. కానీ ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ తో సోనియా.. రాహుల్ మోడీ సర్కార్ పై మండిపడుతున్నారు.. ఈనేపథ్యంలో బిల్లు ఆమోదం అతి కష్టమని తేలిపోయింది. మరో వైపు బీజేపీ నేతలు కూడా ఈ విషయంలో వెనక్కి తగ్గి.. బిల్లును ప్రవేశ పెట్టి భంగపడే కన్నా.. ప్రస్తుతానికి వెనక్కి తగ్గాలని నిర్ణయించుకున్నారట. 2016 ఏప్రిల్ తర్వాత అంటే బడ్జెట్ సమావేశాల తర్వాత ప్రవేశ పెట్టి ఆమోదం పొందేలా చూస్తున్నారట. మరి అప్పుడైనా ఈ బిల్లు ఆమోదం పొందుతుందో లేదో చూడాలి.






