TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జయలలితకు మోడీ ఫోన్.. వర్షం గురించి ఆరా..

Published on: Wed Dec 2, 2015 10:32AM

 

తమిళనాడు భారీ వర్షాలతో నీటి సంద్రమైపోయింది. ఇంకా నాలుగు రోజులు వర్ష ప్రభావం ఉంటుందని.. రోజుకు 20 సెం.మీ వర్షం కురుస్తుందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో చెన్నై వాసులు ఆందోళన చెందుతున్నారు. ఈనేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ.. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల గురించి అడిగి తెలుసుకన్నారు. అంతేకాదు కేంద్రం తరఫున అవసరమైన సాయాన్ని అందజేసేందుకు సిద్ధమని మోదీ తెలిపారు. మరోవైపు తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు విమాన, రైలు సర్వీసులు రద్దయ్యాయి. సుమారు లక్షా 70 వేల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.