Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మోడీపై లాలు కొడుకు విమర్శ.. బట్టలు ఉతుక్కోవడానికి వచ్చారు
posted on: Dec 1, 2015 2:37PM

ప్రధాని నరేంద్రమోడీపై విదేశీ పర్యటన నేపథ్యంలో విమర్శలు చేస్తుంటారు. అది అందరికీ తెలిసిన విషయమే. విదేశీ పర్యటనల ద్వారా మోడీ భారత్ కీర్తి ప్రతిష్ఠల్ని పెద్ద ఎత్తున పెంచుతున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులకు సంబంధించి ఫ్రాన్స్ లో జరుగుతున్న అంతర్జాతీయ సమావేశానికి హాజరైన ప్రధాని మోడీ.. వాతావరణ మార్పుల విషయంలో అభివృద్ధి చెందిన దేశాల పాప ఫలితమే అన్న వాదనను వారికి వినిపించి ఈ రోజు ఢిల్లీకి చేరుకున్నారు. అయితే మోడీ పర్యటనను ఉద్దేశించి.. ఇప్పుడే రాజకీయాల్లో ఆరంగేట్రం చేసిన లాలు పుత్రరత్నాలు విమర్శించారు. బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ మోడీ పర్యటనను ఉద్దేశించి మాట్లాడుతూ.. విదేశీ పర్యటనలు చేసే మోడీ తన బట్టలను ఉతుకున్నేందుకు ఢిల్లీ వచ్చారని విమర్శించారు. ఏది ఏమైనా నిన్నకాక మొన్న రాజకీయాల్లోకి వచ్చి.. ప్రధాని నరేంద్ర మోడీ రాజకీయానుభవం ఉన్నంత వయస్సు కూడా లేని వారు ఆయన విదేశీ పర్యటనపై కామెంట్లు చేయడం విచిత్రంగా ఉంది.






