వారిని ఉపేక్షించేది లేదు.. మోడీ
posted on: Nov 18, 2015 9:23AM

అవినీతి మనముందున్న పెద్ద సవాల్ అని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ఆయన మాట్లాడుతూ అవినీతి నిరోధాలకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుందని.. అవినీతి నిర్మూలన కోసం ఓ పద్దతి ప్రకారం చర్యలు తీసుకుంటామని.. అవినీతికి పాల్పడేవారిని ఉపేక్షించేది లేదని దీనిలో భాగంగా నల్లధనం వివరాలు సేకరిస్తామని అన్నారు. పేదలకు సంక్షేమ ఫలాలు చేరువ కావాలని.. పేదరిక నిర్మూలకు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదాన్నిపూర్తిగా నిరోధించాలని సూచించారు.







