విజయ్- రష్మికలను ఆశీర్వదిస్తూ ప్రధాని లేఖ
posted on: Feb 25, 2026 2:22PM
.webp)
కాబోయే వధూవరులు విజయ్ దేవరకొండ, రష్మికలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రధాని మోదీ లేఖ రాశారు. విజయ్ తండ్రి గోవర్ధన్రావు ఆహ్వానంపై ప్రధాని స్పందిస్తూ ఇరు కుటుంబాలకు విషెస్ తెలిపారు. వారి వైవాహిక జీవితం వెండితెర మ్యాజిక్ను అద్బుతంగా సాగాలని ఆకాంక్షించారు.
జీవితాంతం స్నేహితులుగా కలిసి మెలసి ఉండాలని ఆశీర్వదించారు. రేపు రాజస్థాన్లోని ఉదయ్పూర్లో వీరి వివాహం ఘనం జరగనుంది. పెళ్లికి అతికొద్ది మంది బంధుమిత్రులకు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. పలువురు సినీ రాజకీయ వ్యాపార ప్రముఖులకు మార్చి 4 న హైదరాబాద్లో రిసెప్షన్ ఇవ్వనున్నారు.







