పిన్నమనేని సతీమణి అంత్యక్రియలు.. చంద్రబాబు నివాళులు

posted on: May 18, 2016 11:08AM


టీడీపీ సీనియర్ నేత, ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు సతీమణి సాహితి వాణి కారు ప్రమాదంలో చనిపోయిన సంగతి తెలిసిందే. ఆమె మృతికి టీడీపీ అధికారులు సంతాపం తెలిపారు. ఈ రోజు రుద్రపాకలో ఆమె అంత్య క్రియలు నిర్వహించనున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమె భౌతికకాయానికి నివాళులు అర్పించారు. కాగా విజయవాడ నుండి హైదరాబాద్ కారులో వెళుతుండగా.. పహాడీ షరీఫ్ ఔటర్ రింగ్ రోడ్డుపై కారు బోల్తా కొట్టి పిన్నమనేని సతీమణి, కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. పిన్నమనేనికి కూడా తీవ్రగాయాలయ్యాయి.

google-ad-img
    Related Sigment News
    • Loading...