పిడుగురాళ్ళ వద్ద ఘోర ప్రమాదం

 

గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ మండలం జానపాడు గ్రామ శివార్లలో ఆదివారం నాడు ఘోర ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో ఐదుగురు మరణించగా, 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. కారంపూడి గ్రామానికి చెందిన సానబోయిన మల్లయ్య కుమార్తె వివాహానికి బంధువులంతా కలసి లారీలో రాజుపాలెం మండలంలోని దేవరంపాడు గ్రామానికి వెళ్ళారు. వివాహం తర్వాత తిరిగి స్వగ్రామానికి వస్తుండగా జానపాడు శివార్లలో వున్న మూల మలుపు వద్ద కారంపూడి నుంచి పిడుగురాళ్ళకు వస్తున్న ఆర్టీసీ బస్సుసు అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న పూర్ణమ్మ, మాధవి, కమలాబాయి, జయమ్మతోపాటు మరో వ్యక్తి మరణించారు.