పేర్ని నానికి అరెస్ట్ వారెంట్ జారీ

 

వైసీపీ మాజీ మంత్రి మాజీ మంత్రి పేర్నినానికి బిగ్ షాక్ తగిలింది. నూజీవీడు కోర్టు ఆయనకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 2019లో టీడీపీ కార్యకర్త చందు, శ్రీహర్ష లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో సాక్షిగా పేర్ని నాని ఉన్నారు. వరుసగా వాయిదాలకు కోర్టుకు పేర్ని నాని హాజరుకాలేదు. కోర్టుకు రాకపోవటంతో తదుపరి విచారణకు  నానిని కోర్టులో హాజరుపరచాలని పోలీసులని మచిలీపట్నం కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 19వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది. దీంతో తమ ఎదుట హాజరుకావాలని పలుమార్లు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినా సరే పేర్నినాని కోర్టుకు హాజరుకాలేదు. మూడు సార్లు వాయిదా వేసినా కానీ హాజరుకాకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించి వారెంట్ జారీ చేసింది. 
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu