రూ.3,32,205 కోట్లతో పయ్యావుల పద్దు
posted on: Feb 14, 2026 10:46AM

ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అంతకు మందు ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రివర్గం బడ్జెట్ ను ఆమోదించింది.
రూ.3,32,205 కోట్లతో పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రెవెన్యూ వ్యయం రూ.2,56,143 కోట్లు, మూలధన వ్యయం రూ.53,915 కోట్లుగా అంచనా వేశారు. ఇక రెవెన్యూ లోటు రెవెన్యూ లోటు రూ.22,002 కోట్లు.ద్రవ్య లోటు రూ.75,868 కోట్లుగా అంచనా వేశారు.
ఇలా ఉండగా పయ్యావుల తన బడ్జెట్ లో పాఠశాల విద్య రూ.32,308 కోట్లు కేటాయించారు. ఇక వైద్యానికి రూ.19,306 కోట్లు, వ్యవసాయానికి రూ.11,745 కోట్లు, సాంఘిక సంక్షేమం రూ.11,118 కోట్లు కేటాయించారు.


.webp)



