Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...'ఎవడు' ఆడియోకి పవన్ కళ్యాణ్
posted on: Jun 28, 2013 5:00PM
.jpg)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'ఎవడు' ఆడియో ఈ నెల 30న తేదిన విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆడియో ఫంక్షన్ కి మెగా హీరోలు అందరూ వస్తారని సమాచారం. ముఖ్యఅతిధిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది' చిత్రం షూటింగ్ కోసం యూరప్ వెళ్ళారు. అక్కడ షూటింగ్ ముగించుకొని ఈ నెల 30న హైదరాబాద్ కి వస్తున్నారు. అదే రోజు సాయంత్రం 'ఎవడు' ఆడియో ఫంక్షన్ లో పాల్గొంటారని అంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఉత్తరఖాండ్ వరద బాధితుల పనుల పర్యవేక్షణలో బిజీగా ఉండడంతో ఆయన హాజరుకాకపోవచ్చునని చెబుతున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు. అల్లు అర్జున్, రామ్ చరణ్ కాంబినేషన్ కావటంతో ఈ సినిమాకి మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. ఈ చిత్రంలో శృతి హాసన్, బ్రిటిష్ మోడల్ అమీ జాక్సన్ సెకండ్ హీరోయిన్ గా చేస్తోంది.






