అగ్రిగోల్డ్ బాధితులకు పవన్ భరోసా...


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి అగ్రిగోల్డ్ బాధితులకు భరోసా ఇవ్వనున్నారు. ఈనేపథ్యంలోనే ఆయన విజయవాడ చేరుకున్నారు. విజయవాడలో జనసేన కార్యకర్తలు, అభిమానులు పవన్ కు ఘనస్వాగతం పలికారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ వస్తుడటంతో ఇప్పటికే ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా నుండి అగ్రిగోల్డ్ బాధితులు భారీగా చేరుకున్నారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ అగ్రిగోల్డ్ బాధితులకు  భరోసా ఇవ్వనున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... కోర్టు ఒత్తిడి ఉన్నా ఎందుకు తాత్సరం చేస్తున్నారు...ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు..ఇన్ని ఆస్తులు ఉండీ కూడా బాధితులకు ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు. అగ్రిగోల్డ్ సమస్య ఓ చిక్కుముడి.. జాగ్రత్తగా సమస్యను పరిష్కరించుకోవాలి..బాధితులతో మాట్లాడిన తరువాత.. ప్రభుత్వంతో మాట్లాడటంపై నిర్ణయం తీసుకుంటా అని అన్నారు.