Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఫోన్ ట్యాపింగ్ పై సీబీఐ విచారణ జరిపించాలి: పవన్ కళ్యాణ్
posted on: Jul 6, 2015 7:57PM
.jpg)
ఓటుకి నోటు కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది కనుక దాని గురించి తానేమీ మాట్లాడబోనని పవన్ కళ్యాణ్ అన్నారు. కానీ ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడుతూ, “ఒక రాష్ట్ర ప్రభుత్వం మరొక రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారుల ఫోన్లు ట్యాపింగ్ చేయడం చాలా తీవ్రమయిన నేరం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోపిస్తున్నట్లుగా ఒకవేళ నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉండి ఉంటే దానిపై సీబీఐ చేత విచారణ జరిపించి నిజాలు నిగ్గు తేల్చవలసి ఉంది. అయినా రాజకీయాలను ఇంతగా దిగజార్చుకోవడం ఎవరికీ మంచిది కాదు. దాని వలన వారే కాదు ఇరు రాష్ట్రాల ప్రజలు కూడా తీవ్రంగా నష్టపోతారు. కనుక ఇప్పటికయినా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు వాటి రాజకీయ యుద్దాలను ఇంతటితో ఆపి పరిపాలనపై దృష్టి పెట్టాలని కోరుతున్నాను. లేకుంటే ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య అంతర్యుద్దాలకి దారి తీసే ప్రమాదం ఉంది,” అని హెచ్చరించారు.


.jpg)
.jpg)


