Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పరిటాల శ్రీరామ్ బెయిలు తీర్పు వాయిదా
posted on: Jan 8, 2013 6:05PM
.jpg)
ఆనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన కాంగ్రెస్ నేత కామిరెడ్డిపల్లి సుధాకర్ పై జరిగిన హత్యకుట్రలో పరిటాల రవి కుమారుడయిన పరిటాల శ్రీరాంపై పోలీసులు కేసు నమోదు చేయడంతో అతను అజ్ఞాతంలోకి వెళ్ళిపోయేడు. గానీ, అతను తన లాయర్ ద్వారా ఈ నెల 2వ తేదిన ఆనంతపురం కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసాడు. దానిపై విచారణ చేపట్టిన కోర్టు తన తీర్పును రేపటికి అనగా బుధవారానికి వాయిదా వేసింది. పరిటాల శ్రీరామ్ ఈ నెల 7వ తేదిన సింగపూర్ వెళ్ళేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకొన్న తరుణంలో పోలీసులు కేసు నమోదు చేయడం, అతను అజ్ఞాతంలోకి వెళ్ళడం జరిగింది. అతని తల్లి పరిటాల సునీత,మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీయే తమను రాజకీయంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఈ కుట్ర పన్నినట్లు ఆరోపించారు.


.jpg)
.jpg)


