పరిటాల శ్రీరామ్ కు 14 రోజుల రిమాండ్

 

 

 

అనంతపురం జిల్లా రాప్తాడు శాసన సభ్యురాలు, టిడిపి నేత పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్‌ను శుక్రవారం ఉదయం పోలీసులకు లొంగిపోయారు. శ్రీరామ్‌ను ధర్మవరం కోర్టుకు తరలించడంతో కోర్టు ఈనెల 6 వరకు రిమాండ్ విధించింది. దీంతో అధికారులు శ్రీరామ్‌ను ధర్మవరం సబ్ జైలుకు తరలించారు. శీరామ్ అరెస్ట్‌పై పరిటాల సునీత మాట్లాడుతూ తన కుమారుడు ఎలాంటి తప్పుచేయలేదన్నారు. శ్రీరామ్ విడుదల కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రెండు రోజుల క్రితం కనగాలపల్లి మండలం ఎలకుంట్లలో జరిగిన ప్రచార కార్యక్రమంలో వైసీపీ-టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఇరు వర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు.