TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పారిస్ పేలుళ్ల ప్రధాన సూత్రధారి అబ్దల్ అమీద్ అబౌద్ హతం..

Published on: Wed Nov 18, 2015 12:15PM


పారిస్ లో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ మొదలయ్యింది. ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు గాలింపు చర్యలు చేస్తున్న నేపథ్యంలో పోలీసులు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దురు పోలీసులు మృతి చెందగా మరో ఇద్దురు పోలీసులు గాయపడ్డారు. కాగా పారిస్ పోలీసులు సెయింట్ డెవిస్ ప్రాంతంలోని అపార్ట్ మెంట్ ను చుట్టుముట్టి కాల్పులు జరపగా ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.. ఐదుగురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు అపార్ట్ మెంట్లో పేలుళ్ల ప్రధాన సూత్రధారి అబ్దల్ అమీద్ అబౌద్ ను కాల్చి హతం చేసినట్టు.. ఒక మహిళా ఉగ్రవాది తనను తాను కాల్చుకున్నట్టు పారిస్ పోలీసులు తెలుపుతున్నారు. ఇదిలా ఉండగా సెయింట్ డెవిస్ ప్రాంతంలో పోలీసులు  హై అలర్ట్ ప్రకటించారు.. ఇళ్ల నుండి ఎవ్వరూ బయటకు రావద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.