బుద్ది చెప్పడానికే దాడి చేశాం.. ఐఎస్ఐఎస్

posted on: Nov 14, 2015 11:54AM

 

ప్యారిస్ లో ఉగ్రవాదులు దాడి చేసి మారణహోమం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈదాడిలో ఇప్పటికే చనిపోయిన వారి సంఖ్య 170కి చేరగా.. చాలా మందికి తీవ్రగాయాలయ్యాయి. ఇదిలా ఉండగా ప్యారిస్ లో దాడులు చేసింది తామేనని ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు ప్రకటించుకున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలండ్ సిరియా విషయంలో జోక్యం చేసుకున్నాడని.. అనవసరంగా తమతో పెట్టుకున్నారని, మీకు తగిన బుద్ది చెప్పడానికే ఈ దాడులు చేస్తున్నామని ఉగ్రవాదులు చెప్పారని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. అంతే కాకుండ ఉగ్రవాదులు అల్లాహో అక్బర్ అంటూ నినాదాలు చేశారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. అయితే ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులే దాడి చేశారని హోలండ్ ఇప్పటికీ కచ్చితంగా చెప్పడం లేదు.

google-ad-img
    Related Sigment News
    • Loading...