ఆఖరి పంచాయితీ
posted on Jul 31, 2013 11:32AM
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఆఖరి పంచాయితీ ఎన్నికలు మొదలయ్యాయి. ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 16 మండలాల్లో 272 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు మొదలయ్యాయి.ఇప్పటికే 14 తెలుగుదేశం, పది కాంగ్రెస్ మద్దతుదారులు, ఇద్దరు వైసీపీకి చెందిన 31 పంచాయతీలు ఏకగ్రీవం కాగా మరో 23 పంచాయతీల్లో సర్పంచ్లతో సహా పూర్తికార్యవర్గం ఏకగ్రీవమయ్యాయి. 241 గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవులకు జరిగే ఎన్నికల్లో 723 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
తెలంగాణ ప్రాంతంలో అన్ని పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నా సీమాంద్రల్లోని కొన్ని డివిజన్లలో మాత్రం ఎలక్షన్లకు ఇబ్బందులు తలెత్తాయి. బంద్లు, నిరసనలతో హోరెత్తుతున్న చాలా చోట్ల ఎన్నికలు వాయిదా వేసే అవకాశం కనిపిస్తుంది. ఇవాల వాయిద పడ్డ డివిజన్లలో ఆగస్టు 8 తిరిగి ఎన్నికలు నిర్వహించనున్నారు.