Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పాక్ కకావికలు!
posted on: May 9, 2025 4:01AM

లాహోర్, కరాచీ, ఇస్లామాబాద్, రావల్పిండి సహా పలు నగరాలపై ఇండియన్ ఆర్మీ భీకరదాడులు
సురక్షిత ప్రాంతానికి పారిపోయిన పాక్ ప్రధాని
భారత్ ధాటికి బెంబేలెత్తుతున్న పాక్ ఆర్మీ
ఆపరేషన్ సిందూర్కు ప్రతీకారంగా దాయాది పాక్ భారత్లోని పలు ప్రాంతాల్లో వరస దాడులకు పాల్పడుతోంది. గురువారం రాత్రి జమ్ము వర్సిటీ సమీపంలో పాక్ ప్రయోగించిన 2 డ్రోన్ల బాంబులను భారత భద్రతా దళాలు కూల్చివేశాయి. పంజాబ్లోని జలంధర్లోనూ పాక్ మిస్సైల్స్తో విరుచుకు పడింది. ఇక ఉదంపూర్, జమ్మూ, అఖ్నూర్, పఠాన్కోట్ ఎయిర్బేస్, కథువా, రాజౌరి, అమృత్సర్ ప్రాంతాల్లో దాడులకు తెగబడింది. ప్రముఖ వైష్ణోదేవి ఆలయంపైకి డ్రోన్ దాడికి కూడా యత్నించింది.అయితే ఈ దాడులను భారత్ దీటుగా తిప్పికొట్టింది. పాక్ డ్రోన్లను ఎస్-400 సాయంతో ధ్వంసం చేసింది. అలాగే పాకిస్థాన్ కు చెందిన ఎఫ్-16 యుద్ధవిమానాన్ని కూల్చి వేసింది.
అలాగే పాక్ దాడులకు దిగిన ప్రాంతాలన్నిటిలోనూ క్లాక్ అవుట్ ప్రకటించింది. పాక్ దాడులకు దిగిన కొద్ది వ్యవధిలోనే భారత్ ఆర్మీ ఎదురుదాడులకు దిగింది. లాహోర్, సియోల్కోట్, పాక్ ఆర్థిక రాజథాని కరాచీ, ఇస్లామాబాద్ లపై దాడులు చేసింది. అంతకు ముందు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. పరిస్థితి వివరించారు. అంతకు కొద్ది సేపటి ముందు రాజ్ నాథ్ సింగ్ త్రివిధ దళాధిపతులతో సమావేశమై.. పాక్ కు గట్టి బుద్ధి చెప్పాలని సూచించారు. ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఆ వెంటనే భారత్ పాక్ లోకి కీలక ప్రదేశాలు లక్ష్యంగా దాడులకు దిగింది. కరాచీ పోర్టు లక్ష్యంగా దాడులకు దిగింది. అలాగే పాకిస్థాన్ గగన రక్షణ వ్యవస్థలను టార్గెట్ చేస్తూ లాహోర్, రావల్పిండి, ఇస్లామాబాద్ సహా 9 నగరాలపై డ్రోన్లు, క్షిపణులతో అటాక్ చేసింది. ఇస్లామాబాద్ లోని ప్రధాని నివాసానికి సమీపంలో కూడా దాడులకు పాల్పడింది. దీంతో పాక్ ప్రధాని అధికారిక నివాసాన్ని ఖాళీ చేసి సురక్షిత ప్రాంతానికి తరలిపోయారు.
ఇలా ఉండగా ఒక వైపు భారత్ భీకరదాడులు, మరో వైపు బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ పాక్ సైనికులే లక్ష్యంగా పాల్పడుతున్న దాడులు, ఇంకొ వైపు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ ఆందోళనలతో పాకిస్థాన్ ఉక్కిరిబిక్కిరి అయిపొతొంది. పాకిస్థాన్ ప్రభుత్వ అసమర్థతను నిలదీస్తూ పాకిస్థాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి ఇస్లామాబాద్ లో భారీ ర్యాలీ జరిగింది. మొత్తం మీద భారత్ ఒక్కసారిగా విరుచుకు పడటంతో పాకిస్థాన్ కకావికలైందనే చెప్పాలి.






