వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తాం!
posted on: Oct 7, 2024 2:41PM

మోదీ ప్రభుత్వం తీసుకొస్తున్న వక్ఫ్ సవరణ బిల్లును తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. నిజామాబాద్ లో ఆదివారం నాడు ఓ బహిరంగ సభలో మాట్లాడిన ఆయన మోదీ ప్రభుత్వం మైనారిటీలపై చట్టాలు తీసుకొచ్చి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. దేశంలోని 90 శాతం మసీదులకు యాజమాన్యాన్ని రుజువు చేసే పత్రాలు లేవని, వక్ఫ్ బిల్లు సవరణ బిల్లు చట్టంగా మారితే మసీదులు, ఇతర ముస్లిం మత స్థలాలను కేంద్రం లాక్కుంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.






