బీఫ్ ఫెస్టివల్ కు పోటీగా పందికూర ఫెస్టివల్..

ఓయూలో బీఫ్ ఫెస్టివల్ వివాదం ముదురుతోంది. ఈనెల 10 వ తేదీన ఎలాగైనా బీఫ్ ఫెస్టివల్ నిర్వహిస్తామని బీఫ్ ఫెస్టివల్ నిర్వహకలు తేల్చిచెబుతున్నారు. మూడుసార్లు బీఫ్ ఫెస్టివల్ నిర్వహించినా మాట్లాడనివారు ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు బీఫ్ ఫెస్టివల్ ను ఉద్దేశించి మరో దాద్రి ఘటన అవుతుందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు.. ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు అతనిపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా బీఫ్ ఫెస్టివల్ కు ఫోటీగా పందికూర ఫెస్టివల్ నిర్వహించాలని ఓయూ జేఏసీ నిర్ణయించుకుంది. ఈనెల 8న పందికూర ఫెస్టివల్ నిర్వహించి తీరుతామని.. ఉద్రేకాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు బీఫ్ ఫెస్టివల్ వద్దని ఓయూ జేఏసీ అభిప్రాయపడింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu