బీఫ్ ఫెస్టివల్ కు నో చెప్పిన హైకోర్టు..

posted on: Dec 9, 2015 12:02PM


 

ఈనెల 10వ తేదీన బీఫ్ ఫెస్టివల్ నిర్వహించాలని ఎప్పటినుండో ఓయూ విద్యార్దులు అనుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వ్యవహారంపై అనేక వివాదాలు తలెత్తాయి. ఈ బీఫ్ ఫెస్టివల్ కు పోటీగా కొంతమంది పోర్క్ ఫెస్టివల్ కూడా నిర్వహించాలనుకున్నారు. కాగా ఇప్పుడు బీఫ్ ఫెస్టివల్ నిర్వాహకులకు హైకోర్టులో చుక్కెదురైంది. బీఫ్ ఫెస్టివల్ నిర్వహించడానికి అనుమతించవద్దని కడియం రాజు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఓయూలో బీఫ్ ఫెస్టివల్ నిర్వహించవద్దని.. ఫెస్టివల్ నిర్వహించకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలి.. శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని తెలిపింది. సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వులు కూడా అమలు పరచాలని హైకోర్టు ఆదేశించింది

google-ad-img
    Related Sigment News
    • Loading...