పదేళ్ల బాలుడు పోలీస్ కమిషనర్గా

posted on: May 1, 2015 11:26AM

 

రాజస్థాన్ లో ఓ పదేళ్ల బాలుడు పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించాడు. పదేళ్ల బాలుడేంటి పోలీస్ కమిషనర్ ఏంటీ అనుకుంటున్నారా... రాజస్థాన్ కి చెందిన గిరీశ్ శర్మ అనే బాలుడు గత కొద్ది రోజులుగా తీవ్ర కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నాడు. ఆబాలుడికి బాగా చదివి పోలీస్ కమిషనర్ కావాలనే కోరిక. దీంతో మేక్ ఏ విష్ ఫౌండేషన్ అనే సంస్థ అతని కోరికను గుర్తించి ఈ విషయాన్ని పోలీస్ కమిషనర్ జంగా శ్రీనివాసరావుకు చెప్పింది. దీంతో ఆయన గిరిశ్ శర్మకు ఒకరోజు పోలీస్ కమిషనర్ అయ్యే అవకాశం కల్పించి తన కోరికను తీర్చారు. పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే గిరీశ్ శర్మ తో ప్రత్యేక ఛాంబర్ లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గిరీశ్ శర్మ మాట్లాడుతూ ఈ దేశానికి ద్రోహం చేసేది ఎక్కువ దొంగలేనని వారిని అరెస్టు చేయడమే తన లక్ష్యమని చెప్పాడు.

google-ad-img
    Related Sigment News
    • Loading...