అయ్యో ఏడుకొండల వాడా మళ్లీ ఏమయ్యింది...

posted on: Jan 13, 2025 4:02PM

తిరుమల ఘట్ రోడ్డుపై ప్రమాదం సంభవించింది. వైకుంఠ ద్వార దర్శనం కోసం వెళ్లిన ఆరుగురు భక్తులు మృత్యువాత ఘటన మరువక ముందే సోమవారం(జనవరి 13) ఉదయం కొండపై శ్రీవారి లడ్డూ ప్రసాదం ఇచ్చే కౌంటర్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు వ్యాపించడంతో భక్తులు పరుగులు తీశారు.   ఈ ఘటన జరిగిన మరికొద్ది గంటల్లో ఘాట్ రోడ్డులో బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు అదుపు తప్పి ఘాట్ రోడ్డుపై ఉన్న పిట్టగోడను ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాదంవల్ల ఘాట్ రోడ్డుపై ట్రాఫిక్ స్థంభించింది. తిరుమల కొండపై వరుస ఘటనలతో భక్తులు ఆవేదన చెందుతున్నారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...