Latest News
ఓ ముగ్గురి కథ కొంచెం విడుదలయ్యింది
posted on: Feb 13, 2014 4:53PM

దయా పిక్చర్స్ అనే నూతన నిర్మాణ సంస్థ "ఓ ముగ్గురి కథ" అనే చిత్రాన్ని తెరకేక్కిస్తుంది. ఈ చిత్రం ద్వారా కిరణ్, ఫణి ప్రకాష్, వర్ధన్, హిమజలు తెలుగుతెరకు పరిచయమవుతున్నారు. దయా దర్శకత్వంలో కె.నరేందర్ రెడ్డి, కె.వరలక్ష్మి రెడ్డి నిర్మిస్తున్నారు. 25 రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యిందని, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్ర ట్రైలర్స్ ను, పోస్టర్స్ ను ఫిల్మ్ ఛాంబర్ లో విడుదల చేసారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ ముఖ్య అతిధిగా విచ్చేసారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.






