స్వర్గీయ ఎన్టీఆర్ కు ప్రముఖుల నివాళి

 

స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈరోజు హైదరాబాద్ లో ఎన్టీఆర్ ఘాట్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ, హరి కృష్ణ, జూ. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి పురందేశ్వరి దంపతులు ఇంకా అనేకమంది తెదేపా నేతలు వచ్చి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం హరికృష్ణ మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు, కళారంగానికి అపారమయిన సేవ చేసిన స్వర్గీయ ఎన్టీఆర్ కు భారతరత్నఅవార్డు ఇచ్చి గౌరవించాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. అందుకోసం ప్రజలు, రాజకీయ పార్టీలు కూడా కేంద్రం మీడియా ఒత్తిడి తీసుకురావాలని కోరారు.