Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...లోక్సభలో ఏ పార్టీకి మెజారిటీ రాదు: ప్రియాంక
posted on: May 5, 2014 2:12PM

నిన్నటి వరకూ కాంగ్రెస్ పార్టీకి లోక్సభలో పూర్తి మెజారిటీ వస్తుందని డాంబికాలు పలికిన ప్రియాంకా గాంధీకి హఠాత్తుగా జ్ఞానోదయం కలిగినట్టుంది. అందుకే తన తమ్ముడి నియోజకవర్గం అమేథి సాక్షిగా మనసులోని మాటను బయటపెట్టారు. ఈ ఎన్నికలలో కేంద్రంలో ఏ పార్టీకీ అధికారం రాదని ప్రియాంక చెప్పారు. కాంగ్రెస్కి మెజారిటీ రాదన్న విషయం ఏనాడో తెలిసిపోయింది. ఇప్పుడు ఈ విషయం ప్రియాంకకి కొత్తగా అర్థమైనట్టుంది. అయితే ప్రియాంక వ్యాఖ్య వెనుక అసలు ఉద్దేశం మరోటి వుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజారిటీ వచ్చే అవకాశం వుందన్న అభిప్రాయాలు దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి. దీనిని తట్టుకోలేని ప్రియాంక కాంగ్రెస్తోపాటు బీజేపీకి కూడా పూర్తి మెజారిటీ రాదని చెప్పడం కోసమే ఇలా వ్యాఖ్యానించి వుంటారని పరిశీలకులు అంటున్నారు.






