ఏపీ స్పీకర్ మీద వైసీపీ అవిశ్వాసం

 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు మీద వైసీపీ ఎమ్మెల్యేలు అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చారు. వైసీపీఎమ్మెల్యేలు రవికుమార్, సురేష్, పుష్ప శ్రీవాణి తదితరులు అసెంబ్లీ కార్యదర్శి సత్యానారాయణకు ఈ నోటీసులు అందించారు. నోటీసుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ సంతకాలు చేశారు. ఈ అవిశ్వాస తీర్మానం మీద చర్చించేందుకు మళ్లీ పిలిస్తే తప్ప తాను అసెంబ్లీకి కూడా వెళ్లేది లేదని వైసీపీ నాయకుడు జగన్ తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu