Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మొక్కలకు మూత్రం పోయండి... కేంద్రమంత్రి
posted on: May 5, 2015 1:29PM

మీ ఇంట్లో పండ్ల మొక్కలు బాగా ఎదగాలన్నా, బాగా కాయలు కాయాలన్నా మొక్కలకు మూత్రం పోయండి చాలు. ఛీ ఛీ ఇదేంటి అనుకుంటున్నారా ఈ విషయాన్ని స్వయంగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీనే చెపుతున్నారు. సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో 'కరువుపై పోరాటం' అనే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన నితిన్ గడ్కరీ జనపథ్లో ఉన్న తన ఇంటి ఆవరణలోని గార్డెన్లో యూరిన్ చిట్కాను పాటించానని దీంతో తన ఆరెంజ్ తోటలో ఒకటికి రెండింతలు కాయలు కాసాయని చెప్పుకొచ్చారట. అంతేకాదు సోనియాగాంధీ తోటమాలికి తమ బంగ్లాలోని మొక్కలకు కూడా ఈ చిట్కాను వాడమని సెలవిచ్చారు గడ్కరీ. దీంతో బాబోయ్ ఈ గడ్కరీ యూరిన్ చిట్కా ఏంటిరా బాబూ అనుకుంటున్నారట జనాలు. మరి కొందరయితే ఆయన ఎవరికైనా పండ్లు బహుమతిగా ఇస్తే.. ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిందే అంటున్నారట.





