మొక్కలకు మూత్రం పోయండి... కేంద్రమంత్రి

 

మీ ఇంట్లో పండ్ల మొక్కలు బాగా ఎదగాలన్నా, బాగా కాయలు కాయాలన్నా మొక్కలకు మూత్రం పోయండి చాలు. ఛీ ఛీ ఇదేంటి అనుకుంటున్నారా ఈ విషయాన్ని స్వయంగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీనే చెపుతున్నారు. సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో 'కరువుపై పోరాటం' అనే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన నితిన్ గడ్కరీ జనపథ్లో ఉన్న తన ఇంటి ఆవరణలోని గార్డెన్లో యూరిన్ చిట్కాను పాటించానని దీంతో తన ఆరెంజ్ తోటలో ఒకటికి రెండింతలు కాయలు కాసాయని చెప్పుకొచ్చారట. అంతేకాదు సోనియాగాంధీ తోటమాలికి తమ బంగ్లాలోని మొక్కలకు కూడా ఈ చిట్కాను వాడమని సెలవిచ్చారు గడ్కరీ. దీంతో బాబోయ్ ఈ గడ్కరీ యూరిన్ చిట్కా ఏంటిరా బాబూ అనుకుంటున్నారట జనాలు. మరి కొందరయితే ఆయన ఎవరికైనా పండ్లు బహుమతిగా ఇస్తే.. ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిందే అంటున్నారట.