అత్యాచార బాధితురాలిగా నిత్య

posted on: Sep 3, 2013 8:02AM

 

దేశ వ్యాప్తంగా అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాల నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కనుంది. అయితే ఈసినిమాలో లీడ్‌ రోల్‌ చేయడానికి ప్రముఖ హీరోయిన్‌ నిత్యా మీనన్‌ అంగీకరించటం విశేషం.

అయితే తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కనున్న ఈ సినిమాకు అలనాటి నటి శ్రీ ప్రియ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో నిత్యా అత్యాచార బాధితురాలిగా నటించనుంది. అయితే మాలిని 22 పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాను మళయాలంలో ఘనవిజయం సాదించిన 22 ఫీమేల్‌ కొట్టాయం అనే సినిమాకు రీమేక్‌ గా తెరకెక్కిస్తున్నారు.

అయితే ఇన్నాళ్లు కేవలం కమర్షియల్‌ ఎంటర్‌టైనర్స్‌లో మాత్రమే నటిస్తూ వచ్చిన నిత్యామీనన్‌ తొలిసారిగా ఓ ప్రయోగాత్మక చిత్రంలో నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగా ఏర్పడుతున్నాయి.

google-ad-img
    Related Sigment News
    • Loading...