Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...దోషుల నాటకాలతో మరో వారం వాయిదా పడిన నిర్భయ దోషుల ఉరి...
posted on: Feb 7, 2020 9:57AM

అన్నీ సవ్యంగా జరిగితే ఇప్పటికే శిక్ష అమలయ్యేది కానీ, నిర్భయ దోషుల నాటకాలతో ఆలస్యమవుతూ వస్తోంది. దీంతో న్యాయ హక్కుల వినియోగానికి వారికి కేవలం వారం మాత్రమే గడువిచ్చింది ఢిల్లీ హై కోర్టు. ఇటు దోషుల్ని వెంటనే ఉరితీసేలా ఆదేశాలివ్వాలని సుప్రీం లో పిటిషన్ వేసింది కేంద్రం. ఆ పిటిషన్ పై ఈరోజు సుప్రీంలో విచారణ జరగబోతోంది, నిర్భయ కేసులో దోషులకు ఉరి అమలుపై స్టే విధించడాన్ని సవాల్ చేస్తూ కేంద్రం వేసిన పిటిషన్ ను ఢిల్లీ హై కోర్టు కొట్టేసింది. స్టే యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. నలుగురు దోషులను వేర్వేరుగా ఉరి తీయలేమని న్యాయస్థానం పేర్కొంది. దోషులకు ఉన్న అన్ని న్యాయపరమైన హక్కులు వినియోగించుకునేందుకు వారం రోజులు గడువిచ్చింది. వారం రోజుల గడువు ముగిసిన తర్వాత వారి ఉరికి సంబంధించిన విచారణ ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పింది ఢిల్లీ హైకోర్ట్. ఇదిలా ఉండగా దోషులు నలుగురినీ విడిగా ఉరి తీయలేమని ఢిల్లీ హైకోర్ట్ తోసిపుచ్చింది. దీనిపై కేంద్రం దోషులను వెంటనే ఉరి తీయటానికి అనుమతించాలని సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. మరణ మృదంగాన్ని తప్పిచ్చుకునేందుకు అనేక నాటకాలు వేసి దోషులు కాలయాపన చేస్తున్నారు. ఏడేళ్ళ నుంచి తమకు అన్యాయం జరుగుతుందని నిర్భయ తల్లితండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.






