డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు..9మంది మృతి

 

 

 

రైలు ప్రమాదాలు సామాన్య ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. అనంతపురంలో జరిగిన నాదెండ్ ఎక్స్ ప్రెస్ ప్రమాద సంఘటన మర్చిపోక ముందే తాజాగా బుధవారం తెల్లవారు జామున మహారాష్ట్ర లో థానే దగ్గర డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. మూడు బోగిల్లో మంటలు వ్యాపించడంతో 9 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొని వచ్చారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సిఉంది.