ఎస్ఐ పై నైజీరియన్ల దాడి

posted on: Apr 18, 2015 10:25AM

 

ఈమధ్య నగరంలో నైజీరియన్ల ఆగడాలు మరీ ఎక్కువైపోయాయి. ఎక్కడి నుండో చదువు పేరుతో వచ్చిన వీళ్లు మన వాళ్లపైనే దౌర్జన్యంగా దాడులు చేస్తున్నారు. కొంతమంది వీసా గడువు ముగిసినా కూడా అక్రమంగా ఉంటూ పలు మోసాలు చేస్తూ ఇక్కడే ఉంటున్నారు. గతంలో వీళ్లు పోలీసుల పై దాడి చేశారు. మళ్లీ ఇప్పుడు శుక్రవారం రాత్రి ఎస్ఐ పై దాడి చేశారు. లంగర్హౌస్ బాపూఘాట్ ప్రాంతంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అంతలో అటుగా కారులో వెళ్తున్న ముగ్గురు నైజీరియన్లు కారు ఆపమన్నందుకు పోలీసు అధికారిపై దాడి చేశారు. తరువాత ఆ ముగ్గురు పారిపోయారు. పోలీసులు వెంబడించగా ఇద్దరు తప్పించుకున్నారు. ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే వీళ్లని నైజీరియన్ చట్టాల ప్రకారం విచారించాల్సి రావడంతో పోలీసులు కూడా కఠినంగా శిక్షించలేకపోతున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...