కొత్తగా పెళ్లయిన భారత ఆర్మీ జవాన్లకు గుడ్ న్యూస్...
posted on: Apr 28, 2016 4:01PM

భారత ఆర్మీలో పనిచేసే జవాన్లకు ఓ గుడ్ న్యూస్. ఇక నుండి పెళ్లయిన వెంటనే విధులు నిర్వహించడానికి వెళ్లకుండా.. ఒక ఏడాది పాటు కుటుంబం, భార్యతోనే ఉండే అవకాశం ఇచ్చారు. భారత సరిహద్ద దళం (బీఎస్ఎఫ్ ) ఈ విధమైన నిర్ణయం తీసుకుంది. అనేక మంది జవాన్లు తమ జీవిత భాగస్వామితో గడపలేక పోయామన్న బాధతో కాలం వెళ్లదీస్తున్నారని.. పెళ్లయిన వెంటనే తన భాగస్వామి నుండి దూరం కావడం వల్ల వారి పని తీరుపై ప్రభావాన్ని చూపుతుందని ఇలాంటివారికి న్యాయం చేకూర్చాలన్న ఉద్దేశ్యంతో భారత సరిహద్దు దళం (బీఎస్ఎఫ్) ఒక నిర్ణయానికి వచ్చిందని బీఎస్ఎఫ్ డీజీ కె.కె.శర్మ తెలిపారు.



.jpg)

.webp)
.webp)
.webp)


