రామ్‌దేవ్ మళ్లీ దీక్షకు శ్రీకారం!

posted on: Apr 2, 2012 2:26PM

న్యూఢిల్లీ: నల్లధనం, అవినీతికి వ్యతిరేకంగా యోగా గురువు రామ్‌దేవ్ బాబా మళ్లీ దీక్షకు శ్రీకారం చుట్టనున్నారు. గత ఏడాది రామ్‌లీలా మైదానంలో తన దీక్షను భగ్నం చేసిన రోజునే తన వాణిని వినిపించేందుకు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే జూన్ 3న ఒకరోజు ధర్నా చేయనున్నారు. ఆయన న్యూఢిల్లీలోని జంతర్ మంతర్‌ను ఈ ధర్నాకు వేదికగా ఎంచుకున్నారు. అయితే అప్పటివరకు దేశవ్యాప్తంగా శాంతియుత పద్ధతిలో ఆందోళనలు జరుగుతాయని రామ్‌దేవ్ సన్నిహితుడైన ఆచార్య బాలక్రిష్ణన్ ప్రకటించారు. కాగా, తాజా ఆందోళనలకు సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే సైతం మద్దతిస్తున్నారని బాలకృష్ణన్ వెల్లడించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...