ఉప ఎన్నికల్లో ఓటమి పాలైన బెట్టింగ్ వీరులు

posted on: Mar 22, 2012 1:53PM

నెల్లూరుజిల్లా కోవూరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గెలిచారు. అయితే ఆయన మెజార్టిపై కోట్లాది రూపాయల మేరకు బెట్టింగ్ కట్టిన వ్యాపారులందరూ ఇప్పూ లబోదిబోమంటున్నారు. ప్రసన్నకుమార్ రెడ్డికి 25 వేల నుంచి 30 వేల వరకు మెజార్టి వస్తుందని రాష్ట్రవ్యాప్తంగా కోట్లాది రూపాయల బెట్టింగ్ వ్యాపారం జరిగింది. గల్ఫ్, అమెరికా, ఇంగ్లాండ్ లలో వున్న ఆంధ్రులు కూడా ఈ బెట్టింగ్ వ్యాపారంలో పాల్గొన్నారు. కాని ప్రసన్నకుమార్ రెడ్డికి 23, 496 ఓట్ల మెజారిటి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గెలవడం ఖాయమంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఈ ప్రచారాన్ని నమ్మి రాష్ట్ర వ్యాప్తంగా పలువురు కోట్లాది రూపాయలు నష్టపోయారు.

 

 

google-ad-img
    Related Sigment News
    • Loading...