నెల్లూరు జిల్లాలో పెను విషాదం

నెల్లూరులో ఘోర ప్రమాదం జరిగింది, విద్యుత్ షాక్ తగిలి ముగ్గురు విద్యుత్ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు, మర్రిపాడు మండలం కదిరినాయుడుపల్లి గ్రామంలో ట్రాన్స్ ఫార్మర్స్ మరమ్మతులకు వెళ్లగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది, రిపేర్లు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ముగ్గురు ఉద్యోగులు అక్కడికక్కడే మరణించారు, లైన్ మన్ వేణు, అసిస్టెంట్ లైన్ మన్ శ్రీనుతోపాటు మరొకరు మరణించడంతో ఆ మూడు కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి.