ఎన్డీయే మీటింగ్‌కి పవన్ కళ్యాణ్‌కి ఆహ్వానం

posted on: May 19, 2014 5:53PM

 

ప్రస్తుతం రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ హవా నడుస్తోంది. టీడీపీ, బీజేపీ కూటమికి ప్రచారం చేసిన తర్వాత జాతీయ స్థాయిలో కూడా పవన్ కళ్యాణ్‌కి వెయిట్ వచ్చింది. మోడీ, చంద్రబాబు గెలిచాక ఆ వెయిట్ మరింత పెరిగింది. పవన్‌కి మోడీ ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పడం, ట్విట్టర్‌లో కూడా పవన్‌కి థాంక్స్ చెబుతూ మోడీ ట్వీట్ చేయడంతో నేషనల్ లెవల్లో పవన్ లెవల్ పెరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌కి మరో గౌరవం లభించింది. మంగళవారం ఢిల్లీలో జరిగే ఎన్డీయే భాగస్వామ్య పార్టీల సమావేశంలో పాల్గొనాల్సిందిగా పవన్ కళ్యాణ్‌కి ఢిల్లీ నుంచి కబురందింది. భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు రాజ్‌‌నాథ్ సింగ్ పవన్ కళ్యాణ్‌కి స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించినట్టు సమాచారం. ఎన్డీయే మీటింగ్‌లో పాల్గొనడానికి అంగీకరించిన పవన్ కళ్యాణ్ మంగళవారం బయల్దేరి ఢిల్లీ వెళ్ళనున్నట్టు తెలుస్తోంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...