రేపు కోర్టుకు హాజరుకానున్న సోనియా,రాహుల్..


 

నేషనల్ హెరాల్డ్ కేసులో రేపు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ.. ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కోర్టుకు హాజరు కానున్నారు. ఇప్పటికే రేపు కోర్టుకు హాజరు కాబోయే వీరిద్దరు ఏం చేస్తారో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోర్టుకు హాజరయ్యే వీరు ఆతరువాత బెయిల్ కి దరఖాస్తు చేసుకుంటారా లేక రాహుల్ ముందుగానే తాను శబధం చేసినట్టు బెయిల్ కి దరఖాస్తు చేసుకోకుండా జైయిల్ కి వెళతారా అనేది చూడాలి. అయితే ఇప్పుడు అసలు ఈ కేసుపై సోనియా, రాహుల్ పై కోర్టులో పిటిషన్ వేసిన సుబ్రహ్మణ్య స్వామి మాట్లాడుతూ.. ఈ కేసులో రాజకీయాలకు తావు లేదని.. సోనియా, రాహుల్ బెయిల్ కు దరఖాస్తు చేసుకోవాలి.. లేదా జైలుకు వెళ్లాలి.. అలా కాకుండా కోర్టుకు హాజరుకాకపోతే కోర్టు వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందని అన్నారు.