Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జాతీయ ఆయుర్వేద దినోత్సవం 2౦22
posted on: Oct 22, 2022 9:30AM
అఖిల భారత ఆయుర్వేద సంస్థ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రామా కాంత్ యాదవ్ మాట్లాడుతూ ఆరోగ్యనియంత్రణ జీవన శైలి ఆయుహ్ ప్రమాణం పెంచడమే.ఆయుర్వేదం లక్ష్యం. దంతే రస్ సందర్భంగా ఆయుర్వేద మూల పురుషుదు భగవంతుడు ధన్వంతరి ని పూజించడం తో ప్రారంభ మౌతుంది ఆతరువాతే దీపావళి పండుగ జరుపుకుంటారు.అసలు ఆయుర్వేదానికి మనసంస్కృతికి సంబంధం ఉంది. ప్రపంచానికి ఔషదీయ విలువలను అందించిన ఘనకీర్తి మనదేశానిదే. క్రమశిక్షణ గల జీవితానికి ఆధారం ఆయుర్వేదం. ఆయుర్వేదం అంటేనే ఆయుషు పెంచేది అని ఆర్ధం. ప్రపంచ వ్యాప్తంగా ఆయుర్వేదానికి ఆమోదం లభించింది.భారత ప్రభుత్వం ఆయుర్వేద వారోత్చవాలను నిర్వహించేందుకు సన్నద్ధం అవుతోంది. ఆయుర్వేద వారోత్చావాల యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఆయుర్వేదాన్ని బలోపేతం చేయడమే. ప్రాచుర్యం కల్పించేందుకు అయుష్ మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమ్మాన్ని చేపట్టింది.ఇందులో ఒక తీం ను ప్రకటించింది.అదే ప్రతిరోజూ ప్రతిఇంటా ఆయుర్వేదం చికిత్చ.అన్న అంశం ప్రకటించింది. ఆయుర్వేదం నేడు ప్రపంచవ్యాప్తంగా అంగీకరిస్తున్నారు.

దీనికి కారణం ఆయుర్వేదం నేడు ప్రపంచ వ్యాప్తంగా అంగీకరిస్తున్నారు.దీనికి కారణం ఆయుర్వేదం మానవాళికి వ్యక్తితో కాని రోగంతో కాదు రోగ నియంత్రణ కు మాత్రమే అన్నది వాస్తవం. వ్యక్తులు అనారోగ్యంతో ఉంటె శరీర పరిరక్షణ శరీరానికి బలం చేకూర్చడం. జీవన శక్తి కి బలం అందించడం ఆయుర్వేద చికిత్చలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది అదే ఆయుర్వేదంలో ఉంది అద్ఫే ఆయుర్వేదం బోధిస్తుంది కూడా.ఆయుర్వేద చికిత్చ విజ్ఞానం శరీరాని కి బలం చేకూర్చడమే దీనిద్వారా వ్యక్తి అనారోగ్యం పాలుకాడు..ఒకవేళ అనారోగ్యం పాలైనా శరీరానికి తీవ్ర నష్టం కలిగించరాదు.వారు ఆరోగ్యంగా ఉండాలి ఈ చికిత్చ పద్దతిలో ఆహారం తోపాటు విహారం అంటే యోగా సాధన,ప్రాణాయామం ,సూర్య నమస్కారం ఇతర పద్దతులు చేర్చారు.
చికిత్చా పద్దథులలో మూలికలు,రాసాయనాలు. సూచిగా శుభ్రంగా చేసి తయారు చేస్తేనే ఔషదం ప్రమాణం పాటించినట్లు అవుతుంది.దీనిద్వారా పరిరక్షణ ప్రణాళిక ను బలోపేతం చేసేందుకు ఆయుర్వేద రసాయనం స్థాయి కీలక పాత్ర పోషిస్తుంది. దీనిద్వారా సంపూర్ణ ఆరోగ్యం పెంపొందించుకోవచ్చు.శరీరాన్ని ఇతర వ్యాధులు వైరస్ లు సంక్రమించకుండా రక్షణ కవచంలా ఆయుర్వేదం సురక్షచక్రం లా నిలుస్తుంది. అని నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఆయుర్వేదం లో వాడే రసాయనం, పలు రకాల మొక్కల బెరడులు, వేర్లు, ఆకులు పూవులు,మూలికలు అన్నీ ఉంటాయి. అంతా ప్రకృతి కంగా ఆయుర్వేదం లోని పద్దతులను అనుసరించి ఆరోగ్య మూలాల పైన పూర్తి ప్రాకృతికంగా చర్య ప్రతిచర్య ల పై ఆధార పడిఉంటుంది. అందుకు ఆయుర్వేదం చికిత్చ్స పద్ధతి జీవన శైలి పై ఆధార పడి ఉన్న రోగాలను డయాబెటిస్ హై బిపి ఊబకాయం పై చాలా ప్రభావ వంతంగా పనిచేస్తుంది.
ప్రతి ఇంటా ఆయుర్వేద మొక్కలు...
గతం లో ఆయుర్వేదం మొక్కలు వాటి ఔశాదాల గురించి న అవగాహన చాలా తక్కువమందిలో మాత్రమే ఉంటుంది. కోరోనా విలయతాండవం చేస్తున్న సమయంలోకోరోనా ను నియంత్రించడం లో ఆయుర్వేదం దోహదం చేసింది రోగులు సత్వరం కొల్కునేందుకు ఆయుర్వేదం ఉపయోగపడింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చికిత్చ పద్ధతిపై పోటా పోటీ గా సాగింది.అంటే ఒకరకంగా చెప్పాలంటే పెద్ద యుద్ధమే జరిగింది అధిక సంఖ్యాకులు ప్రతి ఇంట్లో గిలోయ్, అలోవేరా, అశ్వగంధ,తులసి సుదర్శన మొక్కల ఇంట్లో కనిపిస్తాయి.
అయుష్ మంత్రిత్వ శాఖ కృషి ఫలించింది...
అయుష్ మంత్రిత్వ శాఖ ఆయుర్వేద చికిత్చ పద్దతిని పెంపొందించేందుకు ఆరు వారాలఆయుర్వేదం ఉత్చవాలను నిర్వహించే కార్యక్రమాన్ని తయారు చేసింది. ఇందుకోసం అనుభవజ్ఞులైన వైద్యుల చేత ఆయుర్వేదం పై అవగాహన కల్పించడం కోసం మొబైల్ ద్వారా ప్రచారం నిర్వహించేందుకు సిద్ధ మయ్యింది. ప్రజలకు అవగాహన కోసం షర్ట్ ఫిలిం మాధ్యమాన్ని ర్యాలీలు ప్రకటనలు వంటి కార్యక్రమాలు చేపట్టా లని నిర్ణయించారు..


.webp)
.webp)


