బాంబులు పేలుతున్నాయ్.. మోడీకి భద్రత పెంచండి: బీజేపీ

 

 

 

చెన్నై రైల్వే స్టేషన్లో జరిగిన బాంబు పేలుళ్ళలో గుంటూరుకు చెందిన స్వాతి అనే యువతి దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ఈ బాంబులు ఆంధ్రప్రదేశ్‌లో పేలడానికి ఉద్దేశించి పెట్టినవేనని, అయితే ట్రెయిన్ గంటన్నర సేపు చెన్నై స్టేషన్‌లోనే ఆగిపోవడం వల్ల అక్కడే పేలుళ్ళు జరిగాయని పోలీసు వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం నరేంద్రమోడీ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తున్నందున, ఆయనకు హెచ్చరిక ఇచ్చే విధంగా ఈ బాంబు పేలుళ్ళు జరపడానికి తీవ్రవాదులు ప్లాన్ చేసి వుండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ సంఘటన మీద భారతీయ జనతాపార్టీ స్పందించింది. ఈ దుర్ఘటనలో ఆంధ్రప్రదేశ్ చెందిన యువతి మరణించడం, పలువురు గాయపడటం మీద తన బాధను వ్యక్తం చేసింది. దీంతోపాటు బీజేపీ ఒక ప్రధానమైన డిమాండ్ చేసింది. ఈ సంఘటన మోడీ ఎలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో వున్నారో తెలియచెబుతోందని, కాబట్టి మోడీకి భద్రత పెంచాలని భారతీయ జనతాపార్టీ డిమాండ్ చేసింది.