Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...స్మార్ట్ విలేజ్ కోసం సపోర్ట్ చేయండి.. నారా లోకేశ్
posted on: May 9, 2015 2:58PM

టీడీపీ యువనేత, పార్టీ కార్యకర్తల సంక్షేమనిధి సమన్వయకర్త నారా లోకేష్ ఆంధ్రరాష్ట్రానికి పెట్టుబడుదారుల కోసం అమెరికా పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఆయన శనివారం శాన్ ఫ్రాన్సిన్స్ కోలోని ఎన్నారైలతో సమావేశమయ్యి వారికి ఏపీ సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన స్మార్ట్ సిటీ, స్మార్ట్ వార్డుల గురించి వివరించారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆంధ్రరాష్ట్ర అభివృద్ధి చేయాలని కోరారు. ఆంధ్రరాష్ట్రంలోని గ్రామాలను బాగా అభివృద్ధి చేసిన వారికి చంద్రబాబు చేతుల మీదుగా సత్కారం అందుతుందని తెలిపారు. నీటి సమస్య ఉన్న చిత్తూరు జిల్లా కుప్పంలో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని అమలు చేసి మంచినీటికార్డు ద్వారా వారికి రోజుకు 20 లీటర్ల నీరు అందిస్తున్నామని అన్నారు. 2020 నాటికి తెలుగు రాష్ట్రాలు దేశంలో ప్రథమస్థానంలో ఉంటాయని, 2050 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దక్షిణ రాష్ట్రాల్లో ప్రథమ స్థానంలో ఉంటుందని అన్నారు.


.gif)
.jpg)


