Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నాగార్జున స్టేట్ మెంట్ రికార్డు చేసిన నాంపల్లి కోర్టు
posted on: Oct 8, 2024 2:30PM
మంత్రి కొండాసురేఖపై సినీ నటుడు నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్ మంగళవారం నాంపల్లి క్రిమినల్ కోర్టులో విచారణకు వచ్చింది. నాగార్జున వాంగ్మూలాన్ని రికార్డు చేయాలని కోర్టు ఆదేశించడంతో నాగార్జున కోర్టుకు హాజరయ్యారు. పరువు నష్టం దావా నాగార్జున దాఖలు చేసిన నేపథ్యంలో అక్టోబర్ 7న ప్రత్యేక విచారణ జరిగింది. తన మాటలను కొండాసురేఖ ఉపసంహరించుకున్నప్పటికీ నాగార్జున సీరియస్ గానే ఉన్నారు. నాగార్జున అడ్వకేట్ ఇప్పటికే జడ్జికి ఇద్దరు సాక్ష్యుల స్టేట్ మెంట్ ఇవ్వనున్నట్టు సమాచారమిచ్చారు. నాగార్జున వెంట ఆయన భార్య అమల, కుమారుడు నాగ చైతన్య కూడా కోర్టుకు వచ్చారు. కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున కోర్టును అభ్యర్థించారు.






