ఎన్‌కౌంటర్ మృతుల గుర్తింపు

 

నల్గొండ జిల్లా మోత్కూరు మండలం జానకీపురం సమీపంలో శనివారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్లో మరణించిన దుండగులు సూర్యాపేల కాల్పుల ఘటనలో నిందితులుగా పోలీసులు గుర్తించారు. మృతులు ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన అక్రమ్ అయూబ్, జాకీర్ బద్రూస్‌గా గుర్తించారు. ఘ ఘటనలో ఇద్దరు దుండగులు, కానిస్టేబుల్ మరణించారు. సీఐ, ఎస్.ఐ.లకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని హైదరాబాద్‌కి తరలించారు. ఘటనా స్థలంలో ఒక కార్బైన్, రెండు పిస్టల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ ప్రభాకరరావు, డీజీపీ అనురాగ్‌శర్మ పరిశీలించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu