ఎన్‌కౌంటర్ మృతుల గుర్తింపు

 

నల్గొండ జిల్లా మోత్కూరు మండలం జానకీపురం సమీపంలో శనివారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్లో మరణించిన దుండగులు సూర్యాపేల కాల్పుల ఘటనలో నిందితులుగా పోలీసులు గుర్తించారు. మృతులు ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన అక్రమ్ అయూబ్, జాకీర్ బద్రూస్‌గా గుర్తించారు. ఘ ఘటనలో ఇద్దరు దుండగులు, కానిస్టేబుల్ మరణించారు. సీఐ, ఎస్.ఐ.లకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని హైదరాబాద్‌కి తరలించారు. ఘటనా స్థలంలో ఒక కార్బైన్, రెండు పిస్టల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ ప్రభాకరరావు, డీజీపీ అనురాగ్‌శర్మ పరిశీలించారు.