Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అవి ఊహాగానాలు మాత్రమే.. నాగం
posted on: Oct 12, 2015 4:34PM

తాను పార్టీని వీడే ప్రసక్తి లేదని నాగం జనార్ధనరెడ్డి స్పష్టం చేశారు. ఈ రోజు నాగం జనార్ధనరెడ్డి కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీని వీడే ప్రసక్తే లేదని.. తాను బీజేపీని వీడి టీడీపీలోకి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. అవి కేవలం ఊహాగానాలు మాత్రమే అని స్పష్టం చేశారు. హోం మంత్రి ఆహ్వానం మేరకే ఢిల్లీ వచ్చానని.. తాను ప్రారంభించిన బచావో తెలంగాణ మిషన్ ద్వారా ప్రజల్లోకి వెళ్తున్న విషయాన్ని రాజ్నాథ్కు వివరించానని వెల్లడించారు. అంతేకాదు రైతు సమస్యలు తెలుసుకునేందుకు తాను రైతు యాత్ర చేశానని.. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, రైతు ఆత్మహత్యలపై రాజ్ నాథ్తో చర్చలు జరిపినట్లు నాగం చెప్పుకొచ్చారు.






