TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ అధికారంలోకి రావాలంటే అలా జరగాలి.. మైసూరా

Published on: Thu Apr 28, 2016 11:35AM

 

వైసీపీ పార్టీ నుండి ఒక్కోక్కరుగా సైకిల్ ఎక్కుతున్నారు. తొలిసారి వెసీపీ నుండి టికెట్ గెలిచిన ఎమ్మెల్యేల దగ్గర నుండి సీనియర్ నేతల వరకూ అందరూ టీడీపీ బాట పట్టారు. తాజాగా నిన్న వైసీపీ పార్టీ సీనియర్ నేత.. మాజీ ఎంపీ ఎంవీ మైసూరా రెడ్డి కూడా పార్టీకి రాజీనామా చేశారు. అయితే తాను మాత్రం ఏ పార్టీలో చేరనని.. పుస్తకాలు రాసుకుంటూ కాలం గడుపుతానని చెప్పారు. అయితే మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన మాత్రం జగన్మోహన్ రెడ్డిపై మాత్రం బాగానే విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ సందర్భంగా జగన్ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తారా అని అడుగగా దానికి ఆయన కాస్త వివరంగానే సమాధానం చెప్పారు. జగన్ అధికారంలోకి రావాలంటే చాలా కష్టమైన పనే అని... అలా రావాలంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తితో ఉండాలి.. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో ప్రస్తుత సీఎం చంద్రబాబు ఘోరంగా విఫలం కావాలి అదే సమయంలో రాజకీయంగా ఇతర పక్షాలు బలీయం కావడం లాంటివి జరగాలి అలాంటప్పుడే అధికారంలోకి రావడం జరుగుతుంది. లేకపోతే జగన్ అధికారంలోకి రావడం కలేనని మైసూరా తేల్చేశారు.