Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పుట్టగొడుగులు తిని నలుగురి మృతి
posted on: Apr 14, 2015 5:16PM

విషపు పుట్టగొడుగులు తిని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు మరణించారు. ఈ ఘటన అసోం రాష్ట్రంలో జరిగింది. అసోంలోని శివసాగర్ జిల్లాలోని లలిత్ పత్తర్ ప్రాంతానికి చెందిన కుటుంబ సభ్యులు సమీపంలోని అడవిలో సేకరించిన పుట్టగొడుగులను వండుకుని తిన్నారు. దాంతో ఆ నలుగురూ తీవ్ర అస్వస్థతకి గురయ్యారు. స్థానికులు వారిని స్థానిక ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. ఇటీవల మేఘాలయ రాష్ట్రంలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. అడవిలో రోడ్డు వేసే పనికి వెళ్ళిన 14 మంది కూలీలు అడవిలో కనిపించిన పళ్ళను కోసుకుని తిన్నారు. దాంతో ఆ 14 మంది అక్కడిక్కడే మరణించారు.






