చెన్నైలో మృతి చెందిన మునికోటి

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ కాంగ్రెస్ పార్టీ తిరుపతిలో నిన్న నిర్వహించిన బహిరంగ సభలో ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్యా ప్రయత్నం చేసిన ముని కామకోటి ఆదివారం మధ్యాహ్నం చెన్నైలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మృతి చెందాడు. అతను తిరుపతిలో మంచాల వీధికికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త. గంగమ్మ తల్లి జాతర కమిటీలో సభ్యుడుగా కూడా ఉండేవాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తదితరులు అతని మృతికి సంతాపం తెలిపారు. ఈ పరిస్థితుల్లో ప్రత్యేక హోదా గురించి మాట్లాడకుండా తనను తాను నిగ్రహించుకొంటున్నట్లుగా పవన్ కళ్యాణ్ ట్వీట్ మెసేజ్ పెట్టారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu