ఆస్పత్రిలో కూడా దీక్ష చేస్తున్న ముద్రగడ..

posted on: Jun 10, 2016 10:03AM

 

కాపు నేత ముద్రగడ పద్మనాభం అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. తుని కేసులో పది మంది నిందితులను అరెస్ట్ చేసిన నేపథ్యంలో.. ముద్రగడ ఆ అరెస్టులను నిరసిస్తూ దీక్ష చేస్తున్నారు. అయితే నాటకీయ పరిణామాల మధ్య ఆయన దీక్షను భగ్నం చేసిన పోలీసులు ముద్రగడను రాజమండ్రి ఆసుపత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో ఉన్నాగానీ ఆయన ఆమరణ దీక్ష ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. ఎంత మంది చెప్పినా దీక్షను మాత్రం విరమించేది లేదని అంటున్నారు. అంతేకాదు చికిత్స అందించేందుకు వైద్యులు చేస్తున్న యత్నాలను కూడా ఆయన అడ్డుకుంటున్నారు. మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

google-ad-img
    Related Sigment News
    • Loading...