తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు సిద్దం 

posted on: Dec 9, 2024 1:23PM

తెలంగాణ తల్లి విగ్రహావిష్కరానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.   ఈ నెల 9న (సోమవారం సాయంత్రం ఆరు గంటలకు)  సచివాలయ ఆవరణలో ఈ వేడుక ప్రారంభం కానుంది.  లక్ష మంది  మహిళల సమక్షంలో విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.  విగ్రహ రూపు రేఖలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపినట్టు తెలుస్తోంది. ఆయన సూచన మేరకు విగ్రహాన్ని తయా చేశారు. ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష నేతలను కూడా ఆహ్వానించారు. గత బిఆర్ఎస్ రూపొందించిన విగ్రహాంలో మార్పులు చేర్పులు చేయడాన్నిఆ పార్టీ నేత, మాజీ సాంస్కృతిక శాఖ చైర్మెన్ జూలూరి గౌరిశంకర్ హైకోర్టులో పిల్ వేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా ఎర్రవెల్లి ఫాం హౌజ్ కు వెళ్లి మాజీ ముఖ్యమంత్రి కెసీఆర్ కు విగ్రహావిష్కరణ ఆహ్వానం అందించారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...