శివసేనకు షాకిచ్చిన మోహన్ భాగవత్‌ ..

 

రాష్ట్రపతి ఎన్నికలు త్వరలో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే శివసేన మోహన్ భాగవత్‌ను రాష్ట్రపతి చేయాలని ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఇప్పుడు శివసేనకు మోహన్ భాగవత్‌ షాకిచ్చారు. అయితే, ఇది ఎప్పటికీ జరిగేది కాదని, తాను ఆర్ఎస్ఎస్ కోసం మాత్రమే పనిచేస్తానని భాగవత్ తెలిపారు. ఆర్ఎస్ఎస్‌లో చేరేముందే తాను అన్ని తలుపులు మూసేశానని, ఈ విషయంలో వస్తున్నవన్నీ వదంతులు మాత్రమేనని ఆయన అన్నారు. పొరపాటున ఎవరైనా తన పేరు ప్రతిపాదించినా తాను ఎప్పటికీ ఒప్పుకోబోనని కుండ బద్దలుకొట్టారు. మరి దీనిపై శివసేన ఎలా స్పందిస్తుందో చూడాలి.